డేంజర్ జోన్ లో హుజుర్ నగర్,మఠంపల్లి మండలాలు...!

సూర్యాపేట జిల్లా: జిల్లాలో రికార్డు స్థాయిలో ఎండ తీవ్రత నమోదు అవుతుంది.భానుడి ప్రతాపానికి ప్రజలు, వృద్ధులు,చిన్నారులు అల్లాడిపోతున్నారు.ఆదివారం హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మఠంపల్లిలో 45.0 డిగ్రీలు,గరేడేపల్లిలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.దీనితో హుజూర్ నగర్ నియోజకవర్గం డేంజర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 High Temperatures Record In Huzurnagar Mathampalli Mandals, High Temperatures ,-TeluguStop.com

అదేవిధంగా జిల్లాల్లో చివ్వెంల 43.2 ,పెన్ పహాడ్ 43.1,సూర్యాపేట 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మద్దిరాలలో అత్యల్పంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రోడ్ల మీదికి ప్రజలు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube