ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయంలో న్యూ టెర్మినల్ కు శంకుస్థాపన జరిగింది.ఈ మేరకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసుకోవడం మన అదృష్టమని చెప్పారు.భారత్ ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అందరూ కృషి చేయాలని తెలిపారు.
మౌలిక వసతులను సమకూర్చుకుంటేనే భారతదేశం ఆ స్థాయికి వెళ్తుందని పేర్కొన్నారు.ఏపీని అభివృద్దిలో నంబర్ వన్ స్థానంలో ఉంచాలని తెలిపారు.