తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.
నారాయణపేట, కొడంగల్ కు ప్రభుత్వం ఎందుకు సాగు నీరు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కాంగ్రెస్ తీసుకువచ్చే ఆరు గ్యారెంటీలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా వికారాబాద్ కు రెండో రైల్వేలైన్ ఎందుకు రాలేదని నిలదీశారు.నారాయణపేటను బీఆర్ఎస్ ను పట్టించుకోలేదన్న రేవంత్ రెడ్డి రెండుసార్లు గెలిచినా రాజేందర్ రెడ్డి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
ఈ క్రమంలో అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు.