అనారోగ్యం బారిన పడిన మరో బీజేపీ సీనియర్ నేత,ఆందోళన లో పార్టీ వర్గాలు

బీజేపీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి కూడా అధికారాన్ని చేజిక్కుంచుకున్న విషయం తెలిసిందే.అయితే ఈ విజయానికి దిష్టి తగిలిన చందనా ఆ పార్టీ కి చెందిన పలువురు నేతలు వరుసగా అనారోగ్యం పాలవుతుండడం ఆ పార్టీ ని ఆందోళనకు గురిచేస్తుంది.

 Bjp Senior Leader Murali Manohar Joshi Admitted In Regency Hospital In Kanpur-TeluguStop.com

మొన్నటికి మొన్న ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం ఆ పార్టీ కి తీరని లోటు గా చెప్పాలి.అయితే సుష్మా మరణం నుంచి ఇంకా కోలుకొని బీజేపీ కి ఆ పార్టీ మరో సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా అనారోగ్యం తో కన్నుమూయడం మరింత కలచివేసింది.

అయితే అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఇంకా ముగియకుండానే ఆ పార్టీ మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులను పోగొట్టుకున్న బీజేపీ పార్టీ కి మరో సీనియర్ నేత అనారోగ్యం తో ఆసుపత్రి పాలవ్వడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

కాన్పూర్ లోని ఆయన నివాసం లో ఆదివారం అస్వస్థతకు గురికావడం తో హుటాహుటిన ఆయనను కాన్పూర్ లోని రీజెన్సీ ఆసుపత్రి కి తరలించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఆయనకు అక్కడ ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది,కండీషన్ ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Telugu Bjpsenior, Muralimanohar, Sushma Swaraj-

బీజేపీ వ్యవస్థాపకుల్లో మురళి మనోహర్ జోషి ఒకరు అన్న విషయం తెలిసిందే.అయితే వయో నిబంధన కారణంగా ఇటీవల ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా చొరవ చూపడం లేదు కానీ ఆ పార్టీ సీనియర్ నేతగా మాత్రం ఆయనకు అందాల్సిన గౌరవం మాత్రం అందుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube