తపాలా ఉద్యోగుల ఒక్కరోజు సమ్మెకు అఖిలపక్షం మద్దతు

యాదాద్రి భువనగిరి జిల్లా: తపాలా ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బుధవారం సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని తపాల కార్యాలయం ముందు తపాలా శాఖ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మెతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు.

 All-party Support For One-day Strike Of Postal Workers Details, Postal Workers,-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా ఉద్యోగులకు రోజుకు ఎనిమిది గంటల పనిని అమలు చేయాలని, అలాగే పెన్షన్ తో సహా అన్ని ప్రయోజనాలను మంజూరు చేయాలని, జీడిఎస్ కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం కల్పించాలని,టార్గెట్ మేళాలా రూపంలో వేధింపులను ఆపేవేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మందుకుల బాలకృష్ణ, ఏపూరి సతీష్,ఏర్పుల సుదర్శన్,ఎండి రహీమ్ షరీఫ్,రాచకొండ రమేష్ బాబు,రసమల్ల యాదయ్య,నోముల మాధవరెడ్డి,వలిగొండ యాదయ్య,తపాలా కార్మికులు బల్లెం రామస్వామి,గంట కృష్ణారెడ్డి,నర్సిరెడ్డి, సత్యనారాయణ, వెంకటారెడ్డి,చిరంజీవి, భాను,జంగయ్య,సౌమ్య, భాస్కర్,వంశీ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube