ఏలూరు( Eluru )లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది.40వ డివిజన్ లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఈ క్రమంలోనే ఓ పార్టీ కార్యకర్తపై మరో పార్టీ కార్యకర్త దాడి చేసి గొంతు కోశాడు.బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దాడి చేసిన వ్యక్తులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని బాధితులకు చెందిన వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు.దీంతో అర్ధరాత్రి నుంచి ఏలూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.