బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు.
తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని సీఎం కేసీఆర్ తెలిపారు.ఎన్నికలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.
అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి గుణం చూడాలన్న కేసీఆర్ అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రపై ఆలోచించాలని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై మండిపడ్డ కేసీఆర్ కాంగ్రెస్ చరిత్ర అంతా మోసమేనని తెలిపారు.