తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ..!!

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ( Rahul Gandhi ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో వయనాడ్, రాయబరేలి లోక్ సభ స్థానాలలో గెలవడం జరిగింది.

 Priyanka Gandhi In The Election Ring For The First Time Details, Priyanka Gandh-TeluguStop.com

దీంతో రెండు నియోజకవర్గాలలో ఒక సీటును వదులుకోవాల్సి రావటంతో.వయనాడ్( Wayanad ) వదులుకున్నారు.

రాయబరేలి ఎంపీగా కొనసాగుతున్నారు.ఈ నిర్ణయంతో వయోనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి.

ఈ క్రమంలో తన సహోదరి ప్రియాంక గాంధీని.( Priyanka Gandhi ) వయనాడ్ నియోజకవర్గం నుండి పోటీకి దింపడానికి సిద్ధమయ్యారు.

ప్రియాంక గాంధీ 2004, 2007 సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అమేథీ, రాయబరేలి పార్లమెంటు స్థానాలలో ప్రచారం చేయటం జరిగింది.ఆ రకంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 12 సంవత్సరాలు పాటు రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ 2019 సార్వత్రిక ఎన్నికలలో.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) తరపున ప్రచారంలో కీలకంగా రాణించారు.అప్పటినుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమితులై యూపీ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేశారు.

అప్పటినుంచి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు.కానీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు.అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంపీగా వయనాడ్ నియోజకవర్గం నుండి తప్పుకోవటంతో అక్కడ ఉప ఎన్నికలు రావడంతో.ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube