ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూకుడు చూపిస్తున్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరు.పెళ్లిచూపులు సినిమాలో ప్రియదర్శి చేసిన కామెడీ ఆయనకు మంచి పేరుతో పాటు అవకాశాలను తెచ్చిపెట్టింది.
ప్రియదర్శికి మాత్రమే సొంతమైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్ ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది.స్పైడర్, జై లవకుశ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా ప్రియదర్శి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన ప్రియదర్శి ఈ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు.ఇప్పటికే ఇంటర్వూకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో ప్రియదర్శి తండ్రి ఏటీఎం కార్డును దొంగలించానని చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి.
ప్రియదర్శి ఈ ఇంటర్వ్యూలో తనకు డబ్బులు అవసరమైన సమయంలో తండ్రి ఏటీఎం దొంగలించి 50 లేదా 100 రూపాయలు విత్ డ్రా చేసి వాడుకునేవాడినని తెలిపారు.అప్పట్లో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసినా మొబైల్ కు మెసేజ్ వచ్చేది కాదని అందువల్ల తాను డబ్బులు దొంగలించినా ఆ విషయం ఎవరికీ తెలియలేదని చెప్పుకొచ్చారు.
అయితే తన తండ్రి పాస్ బుక్ ప్రింట్ తీసిన సమయంలో మాత్రం తన తండ్రికి తాను డబ్బు దొంగలించిన విషయం అర్థమయ్యేదని అప్పుడు తన రౌండ్ పడేదని అన్నారు.అలా దొంగలించిన డబ్బుతో సినిమాలు చూసేవాడినని అన్నారు.
ఈ ఎపిసోడ్ వచ్చే సోమవారం రోజున ప్రసారం కానుంది.ఈ ప్రోమోకు 12 లక్షల వ్యూస్ రాగా 28,000 లైకులు వచ్చాయి.