ఇండియాలో జపాన్ బుల్లెట్ ట్రైన్

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్నది.కొన్ని విదేశాల్లో అతి వేగంగా ప్రయాణించే హై స్పీడ్ బుల్లెట్ రైళ్ళు ఉన్నాయి.

 Japanese Bullet Trains On The Mumbai-ahmedabad Route-TeluguStop.com

ప్రధానంగా బుల్లెట్ రైళ్లకు చైనా , జపాన్ ప్రసిద్ధి.వాటి సరసన ఇండియా కూడా చేరబోతున్నది.

ఇండియాలో బుల్లెట్ ట్రైన్ వస్తే చైనాకు ఎందుకు ఆందోళన ? ఎందుకంటే ఇండియా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్ సంపాదించుకుంది కాబట్టి.ఇలాంటి ప్రాజెక్టుల ఖర్చు కోట్ల రూపాయల్లో ఉంటుంది.

ఇంతటి మెగా ప్రాజెక్టు తనకు దక్కకుండా పోయినందుకు చైనా బాధపడుతోంది.అయినప్పటకీ రాబోయే ప్రాజెక్టుల్లో తమకూ అవకాశం ఉంటుందని తెలిపింది.

ఇండియాలో వివిధ ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు నిర్మించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఒక్క ప్రాజెక్టు జపానుకు దక్కింది.

కాబట్టి చైనాకు కూడా చాన్సు ఉండవచ్చు.ముంబై -అహమ్మదాబాదు మార్గంలో జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతున్నది.

ఇందుకు ఒప్పందం కుదిరింది.ఈ రెండు నగరాల మధ్య దూరం 500 కిలో మీటర్లు.

ఈ ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం కూడా జపాన్ అందిస్తోంది.చెన్నై -ధిల్లీ మార్గంలో (2,200కిలోమీటర్లు) హై స్పీడ్ రైలు మార్గం ఏర్పాటుకు అధ్యయనం సాగుతోంది.

ధిల్లీ -ముంబై మార్గంలో (1200 కిలోమీటర్లు) బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube