నరకాసురుడిని వధించింది శ్రీకృష్ణుడా.. సత్యభామా?

నరకాసురుడిని వధించింది చాలా మంది సత్యభామ అనుకుంటారు.కానీ తల్లి చేతిలో మరణమని అందుకే సత్య భామను యుద్ధానికి శ్రీ కృష్ణుడు తీసుకు వచ్చేలా చేశాడని అనుకుంటారు.

 Lord Krishna Killed Narakasura Or Sathyabhama, Devotional, Narakasurudu, Sathyab-TeluguStop.com

కానీ అది నిజం కాదు.సత్యభామే భూదేవి.

అయితే అసలు నిజం ఏమిటంటే నరకాసురుడిని వధించింది శ్రీ కృష్ణ పరమాత్ముడే.మరి ఈ కథ అంతా ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ మహాలక్ష్మీ పొందుతున్న వైభోగాల గూర్చి చెప్పి, తన వ్యధల గూర్చి భూభారం గూర్చి చెబుతుంది.అప్పుడే శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవి ఇంత వరకూ ఎన్నో భోగాలు అనిభవించిందో అవన్నీ ఒక్క జన్మలోనే సత్యభామగా అనుభవిస్తానని చెబుతాడు.

ఆ సమయంలోనే బిడ్డల కోసం అడుగుతుంది.అడిగిన సమయం విష ఘడియలు కావడంతో రాక్షసులు జన్మిస్తారనీ… తానే వార్ని చంపక తప్పదని చెబుతాడు.భూదేవి కడుపు తీపితో నీవు సంహరించ వద్దని వరం శ్రీ మహా విష్ణువును అడుగుతుంది.అప్పుడు శ్రీ మహా విష్ణువు నీకు నీవుగా చంపమన్నప్పుడే సంహరిస్తానని అభయం ఇస్తాడు.

నరకాసురిడిపై యుద్ధానికి వెళ్లినప్పుడు సత్యభామను చూపి నరకుడు స్త్రీ అగ్నిలా మారే ప్రసంగం చేస్తాడు.తల్లి లాంటి తనపై కారు కూతలు కూయడంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన సత్య భామ శ్రీ కృష్ణ పరమాత్ముడితో.

వెధవను సంహరించూ అంటూ చెప్తుంది.అలా గత జన్మలో వరం పొందినట్లుగానే శ్రీ కృష్ణుడు చక్రాయుధం వదిలేలా చేస్తుంది సత్యభామ.

అలా నరకాసురుడిని శ్రీ కృష్ణ పరమాత్ముడు చంపేస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube