ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు.మహాశివరాత్రి రోజు శివ భక్తులకు ఎంతో పవిత్రమైన రోజు.
భక్తులంతా పరమశివుడిని దర్శించుకునేందుకు దేవాలయాలకు వెళ్తుంటారు.మనదేశంలో ఎన్నో ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి.
అయితే ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ శివాలయం విశిష్టత వెలుగులోకి వచ్చింది.దశాబ్దాలుగా మూసివేసిన ఆలయాన్ని కేవలం మహాశివరాత్రి రోజున మాత్రమే తెరుస్తారు.సోమేశ్వరాలయంగా పిలువబడే ఈ దేవాలయం భూపాల్ కు 48 కిలో మీటర్ల దూరంలో ఉంది.1000 అడుగుల ఎత్తైన కొండ పై ఈ ఆలయం ఉంది.

పదివ శతాబ్ధంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు.1283వ సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.ఆ తర్వాత మాలిక్ కపూర్, మహమ్మద్ షా తుగ్లక్, సాహిబ్ ఖాన్లు సోమేశ్వరాలయాన్ని ఆక్రమించుకున్నారు.1543లో షేర్షా సూరి ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాడు.సామాన్య ప్రజల కోసం ఈ దేవాలయాన్ని తెరవాలని ఈ 1974లో ఉద్యమం జరిగింది.దీని తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ప్రకాష్ సేథీ సోమేశ్వర ఆలయానికి తాళం వేసి సామాన్య ప్రజలు వెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు.

అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చారు.ప్రస్తుతం ఈ దేవాలయాన్ని పురావస్తు శాఖ నిర్వహిస్తుంది.మహా శివరాత్రి రోజు 12 గంటల పాటు అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దేవాలయాన్ని తెరుస్తారు.గత సంవత్సరం ఒక మతపరమైన కార్యక్రమంలో పండిత్ ప్రదీప్ మిశ్రా ఆ సోమేశ్వరా ఆలయం గురించి ప్రస్తావించినప్పుడు ఈ విషయం గురించి ప్రజలందరికీ తెలిసింది.