హర్యానా మంత్రి నోటి దురుసు

బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు నోటి దురుసుతో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.ప్రజలకు ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వారు మతి చలించినవిధంగా ప్రవర్తిస్తున్నారు.

 Farmers Who Commit Suicide Are Cowards, Criminals-TeluguStop.com

వీళ్లు మాట్లాడే పిచ్చి మాటలు వింటుంటే బుర్ర పాడైపోయిందా అనే అనుమానం కలుగుతోంది.హర్యానా బీజేపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఓపి ధన్‌కర్‌ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి పిచ్చి ప్రేలాపనలు చేశాడు.

వారిని అవమానించాడు.ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు పిరికివాళ్లని, నేరగాళ్లని వాఖ్యానించాడు.

రైతుల ఆత్మహత్యలపై దేశమంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి ఈ వాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం చేయకూడదన్నాడు.

ఆత్మహత్య చట్ట ప్రకారం నేరమని, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసకున్నాడంటే అతను తన బాధ్యతల నుంచి పారిపోతున్నట్లేనని వాఖ్యానించాడు.మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వాన్నే కాకుండా పార్టీని కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టాయి.

అధికారంలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారో అర్థం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube