టైటిల్‌పై బోయపాటి క్లారిటీ

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్‌ త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది.

అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.ఇక ఈ సినిమా కోసం అల్లు అరవింద్‌ ‘రథం’ అనే టైటిల్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించినట్లుగా రెండు రోజులుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు టైటిల్‌ ‘రథం’ కాదు అని తేలిపోయింది.ఈ సినిమా టైటిల్‌ విషయంలో వస్తున్న వార్తలను దర్శకుడు బోయపాటి శ్రీను తోసి పుచ్చాడు.

ఈ సినిమా కోసం ఒక పవర్‌ ఫుల్‌ టైటిల్‌ను అనుకున్నాము అని, దాన్ని త్వరలోనే ప్రకటిస్తాను అంటూ బోయపాటి చెప్పుకొచ్చాడు.అయితే అంతా భావిస్తున్నట్లుగా ‘రథం’ అయితే కాదు అని ఈయన క్లారిటీ ఇచ్చాడు.

Advertisement

ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెల రెండవ వారంలో ప్రారంభించాలని అల్లు అరవింద్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా ఇద్దరు హీరోయిన్‌లు నటించనున్నారు.

ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.‘లెజెండ్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఇదే.ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు