చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది.చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Judgment On Chandrababu's Custody Petition Adjourned-TeluguStop.com

కస్టడీ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనల విన్న ఏసీబీ కోర్టు తీర్పును వాయిదా వేసింది.ఈ మేరకు రేపు తీర్పును వెల్లడిస్తామని ప్రకటించింది.

అయితే నిన్న సుదీర్ఘ వాదనలు అనంతరం తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.అయితే హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.

చంద్రబాబు రిమాండ్ ముగుస్తున్న క్రమంలో కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.ఆర్డర్ ఇప్పుడు ఇస్తే రేపు క్వాష్ పిటిషన్ బట్టి చర్యలు తీసుకుంటామని సీఐడీ పేర్కొంది.

అయితే దీనిపై రేపే తీర్పును వెలువరిస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ విచారణలో భాగంగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గానూ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube