అజయ్ ఘోష్,( Ajay Ghosh ) శుభోదయం సుబ్బారావు, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.
సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం `రుద్రమాంబపురం( Rudramanbapuram )`.మూలవాసుల కథ అనేది ట్యాగ్లైన్.ఎన్వీఎల్ ఆర్ట్స్ పతాకంపై నండూరి రాము నిర్మిస్తున్నారు.మహేష్ బంటు దర్శకుడు.మూల కథ అజయ్ ఘోష్.
ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది.
తాజాగా ఈ మూవీ నుండి జాతర సాంగ్ ను ప్రముఖ హీరో శ్రీకాంత్( Srikanth ) గారు విడుదల చేసారు.ఈ పాటను ఆస్కార్ విజేత రాహుల్ సిప్లి గంజ్( Rahul Sipligunj Indian playback singer ) పాడగా, భాష్య శ్రీ సాహిత్యం అందించారు, అలాగే వెంగి సంగీతం సమకూర్చారు.
రుద్రమాంబపురం జులై 6నుండి హాట్ స్టార్ లో విడుదల కానుంది.ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ…ఎన్.
వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ.ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఈ చిత్రంలో తిరుపతి పాత్ర లో అజయ్ గోష్, నటిస్తున్నారు, పెద్దకాపు మల్లోజుల శివయ్య పాత్రలో శుభోదయం సుబ్బారావు ( subhodayam subbarao)నటిస్తున్నారు.వెంగీ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్.వెంకటేశ్వరరావు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
సాంకేతిక వర్గం: నిర్మాత: నండూరి రాము , దర్శకత్వం: మహేష్ బంటు,బ్యానర్: ఎన్వీఎల్ ఆర్ట్స్,కథ: అజయ్ ఘోష్,డిఓపి: ఎన్ సుధాకర్ రెడ్డి సంగీతం: వెంగీ,ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రావు,ఆర్ట్: వెంకటేశ్వర రావు, ఫైట్స్: దేవరాజు, కో- ప్రొడ్యూసర్: డి నరసింహమూర్తి రాజు సీఈఓ: అన్నింగి రాజశేఖర్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కారెడ్ల బాలాజీ శ్రీను ,పీఆర్ఓ: శ్రీధర్
.