భారత్ లో మరోసారి ప్రజల డేటా లీక్ కలకలం చెలరేగింది.దీంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి.
గోప్యతా ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నాయకులు కోవిన్ పోర్టల్ ద్వారా ప్రజల డేటా లీక్ అయిందనిచెబుతున్నారు.ఈ క్రమంలో టీకాలు వేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాస్ పోర్టు నంబర్లు, ఓటర్ ఐడీలు లీక్ అయినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు డేటా లీక్ అయిందని ట్విట్టర్ వేదికగా ప్రతిపక్షాలు పోస్టులు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో కోవిన్ డేటా లీక్ పై అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరణాత్మక నివేదిక సిద్ధం చేస్తుంది.