2023, ఫిబ్రవరి 16 న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియంలో ఆది మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అంతకుముందు ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫిబ్రవరి 16 నుంచి 27 వరకు జరిగే ఈ ఉత్సవాల్లో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వెయ్యి మందికి పైగా కళాకారులు, పాల్గొంటారు.వాణిజ్యం మరియు సాంప్రదాయ కళల సమాలోకనం గిరిజనుల ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు, వారి కళలకు, సంస్కృతికి గుర్తింపు తెచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు.
ఈ పండుగలో గిరిజనుల చేతివృత్తులు, సంస్కృతి, వంటకాలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు.వాణిజ్యం.
హస్తకళలు, చేనేత వస్త్రాలు, కుండలు, ఆభరణాలు తదితరాలు సెంటరాఫ్ అట్రాక్షన్ కానున్నాయి.

గిరిజన రుచుల ఆస్వాదన 11 రోజులపాటు జరిగే ఈ మేళాలో 28 రాష్ట్రాల నుంచి 1000 మంది గిరిజన కళాకారులు, కళాకారులు పాల్గొంటారు.13 రాష్ట్రాలకు చెందిన గిరిజన చెఫ్లు రాగి హల్వా, కోడో ఖీర్, మాండియా సూప్, రాగి బడా, బజ్రా రోటీ, బజ్రా కా చుర్మా, మదువా కీ రోటీ, వా రోటీ, భేల్, కాశ్మీరీ రైతా, కబాబ్ రోగన్ జోష్ వంటి మిల్లెట్ వంటలను తయారుచేసి ఆహార ప్రియులకు అందిస్తారు.వీటి ప్రత్యేక రుచిని ఎవరూ మరచిపోలేరు.
తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్లకు రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్లోని గిరిజన రుచులను కూడా ఆస్వాదించనున్నారు.

గిరిజన చెందిన 200 కుపైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.గిరిజన సంస్కృతి హస్తకళలు, వంటకాలు, వాణిజ్యం మరియు సాంప్రదాయ కళల స్ఫూర్తిని పురస్కరించుకుని నిర్వహించే ఆది మహోత్సవ్ అనేది గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చేపట్టే వార్షిక కార్యక్రమం.వేదిక వద్ద ఉండే 200కు మించిన స్టాల్స్లో దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనుల ఘనత మరియు విభిన్న వారసత్వం ప్రదర్శితమవుతుంది.
భారత ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి కూడా 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది.ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులు పండించిన మిల్లెట్ల ప్రదర్శనపై ఉత్సవాల్లో అదికారులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు.