యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన భార్య అక్షతా మూర్తి నాన్ డోమ్ హోదాపై కేబినెట్ కార్యాలయం నుంచి అధికారిక సలహా అందిన నేపథ్యంలో క్రిస్మస్ నాటికి తన ట్యాక్స్ రిటర్న్ను ప్రచురిస్తానని సునాక్ తెలిపారు.
ఈ ఏడాది ఏప్రిల్లో అక్షతామూర్తి తనకు ప్రపంచవ్యాప్తంగా వివిధ వనరుల నుంచి వస్తున్న ఆదాయంపై పన్ను చెల్లించడానికి అంగీకరించారు.అయితే ఆమె గతంలో నాన్ డోమ్ హోదా కోసం ఏడాదికి 30,000 పౌండ్లు చెల్లించారు.
తద్వారా ఆమె విదేశీ ఆదాయంపై యూకేలో ఎలాంటి పన్ను చెల్లించదు.
గతంలో లిజ్ ట్రస్ చేతిలో ప్రధాని రేసులో ఓడిపోయిన సమయంలో .ఒకవేళ తాను ప్రధానమంత్రి అయితే ట్యాక్స్ రిటర్న్లను ప్రచురిస్తానని చెప్పాడు.ఇక తాజాగా ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్లో.
రిషి సునాక్ తాను ట్యాక్స్ రిటర్న్ను ప్రచురిస్తానన్న హామీకి కట్టుబడి వుంటానని తెలిపారు.సమయానుసారంగా తాను కేబినెట్ కార్యాలయంతో మాట్లాడాలని… సరైన మార్గాన్ని గుర్తించాలని, అలా చేయడంలో తనకు ఎలాంటి సమస్య లేదని రిషి సునాక్ వెల్లడించారు.
ట్యాక్స్ రిటర్న్ను ఎప్పుడు ప్రచురిస్తారన్న ప్రశ్నకు సమాధానంగా రిషి ఇలా అన్నారు.అవి ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి తాను కేబినెట్ కార్యాలయంతో మాట్లాడాల్సి వుందన్నారు.కాగా… బ్రిటీష్ ప్రధాన మంత్రులు తమ ట్యాక్స్ రిటర్న్లను ప్రచురించిన దాఖలాలు చరిత్రలో కనిపించడం లేదు.అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం దేశాధ్యక్షులు ప్రతి ఏటా ట్యాక్స్ రిటర్న్లను బహిర్గత పరచడం ఆనవాయితీగా వస్తోంది.
తాజాగా రిషి సునాక్ ఈ పనిచేస్తున్న తొలి బ్రిటీష్ ప్రధానిగా రికార్డుల్లోకెక్కనున్నారు.