తమ ముఖ చర్మం తెల్లగా మరియు కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని చాలా మంది కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు తెల్లటి మరియు మెరిసేటి చర్మాన్ని పొందడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన ఫేస్ క్రీములు, సీరంలు, ఫేస్ మాస్కులు ఇలా ఎన్నెన్నో కొనుగోలు చేసి వాడుతుంటారు.
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మాత్రం ముఖాన్ని వైట్ గానే కాదు బ్రైట్ గా కూడా మార్చి మెరిసేలా చేస్తుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏమిటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, వన్ టేబుల్ స్పూన్ పెసలు, నాలుగు బాదం పప్పులు, రెండు జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్లు ఎండిన గులాబీ రేకులు, ఒక వాల్ నట్ వేసుకొని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో వన్ టేబుల్ స్పూన్ పాలపొడి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, సరిపడా రోజ్ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా మారుతుంది.చర్మంపై ఏమైనా మచ్చలు, మొటిమలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు సైతం వదిలి పోతాయి.కాబట్టి తెల్లటి మరియు మెరిసేటి ముఖాన్ని కావాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.