టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ చేతినిండా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.ఒక్కో సినిమాకు ప్రభాస్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటూ ఉండగా ట్రోల్స్ చేసేవాళ్లకు ప్రభాస్ భయపడుతున్నారని కామెంట్లు వ్యక్తమవువుతున్నాయి.
ఆదిపురుష్ మూవీ టీజర్ రిలీజైన సమయంలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.ఆ ట్రోల్స్ వల్ల ఆదిపురుష్ ను చూడాలని అనుకునే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది.
మరోవైపు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి చాలారోజుల క్రితం ప్రకటన వెలువడింది.కొన్ని రోజుల క్రితం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇచ్చినా ట్రోల్స్ వస్తాయని భావించి మేకర్స్ సైలెంట్ అయ్యారని సమాచారం అందుతోంది.
స్టార్ హీరో ప్రభాస్ ట్రోలర్స్ కు తన సినిమాల ద్వారానే సమాధానం ఇవ్వాలని భావిస్తున్నట్టు బోగట్టా.
ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో చరిత్ర సృష్టించాలని భావిస్తున్నారు.ఈ రెండు సినిమాలు వేర్వేరుగా 400 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.ప్రభాస్ సినిమాలకు భారీ స్థాయిలో ఖర్చు చేసినా ఊహించని స్థాయిలో లాభాలు వచ్చే అవకాశం ఉండటంతో నిర్మాతలు ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.
ప్రభాస్ సైతం ప్రాజెక్ట్ ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాలో నటిస్తుండగా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.
ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.స్టార్ హీరో ప్రభాస్ సినిమాలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.