సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు.
మృతుడు గ్రామానికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు.కుటుంబ కలహాలే హత్యకు కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మృతుడు ఆగస్ట్ నెలలోనే జైలు నుంచి విడుదల అయ్యాడని తెలుస్తోంది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.