ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిబంధనలు తుంగలో తొక్కారని చీఫ్ విజిలెన్స్ విభాగం నిర్ధారించిందని ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అన్నారు.దీనిపై ఢిల్లీ సర్కార్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు.
లిక్కర్ స్కాంపై ఢిల్లీలో డొంక కదిలితే ఏపీ, తెలంగాణలో మూలాలు వెలుగు చూస్తున్నాయని ఆయన ఆరోపించారు.దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
అనంతరం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై ఆయన మాట్లాడారు.ఎంతో విలువైన భూములను కేవలం రూ.5 వందల కోట్లకే ఓ ప్రైవేట్ సంస్థ చేజిక్కించుకోవడం దారుణమని వ్యాఖ్యనించారు.ఈ క్రమంలో ల్యాండ్ అగ్రిమెంట్ పై జరిగిన అంశాలు తెలపాలని డిమాండ్ చేశారు.