ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవన విధానంలో దాదాపు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వారి వారి వయసుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ బిజీగానే ఉంటున్నారు.ఎందుకంటే చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూళ్లకు వెళ్లడం నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్ అని ఆ తర్వాత ఇంటికి వచ్చి ఏమన్నా చిన్న చిన్న పనులు చేసుకుని నిద్రపోవడం రొటీన్ గా జరుగుతూనే ఉంది.
అలాగే చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటున్నారు.దీని కారణంగా వారి జీవితంలో ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు.
కొంతమందికి పని పరమైన ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.ఈ ఒత్తిడి పెరిగిపోవడం చాలామందిలో తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
ఇలాంటి సమస్యల నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని వైద్యులు చెబుతున్నారు.ఒత్తిడి నుంచి సులభంగా బయటపడడానికి నిపుణులు కొన్ని చిట్కాలను చెబుతున్నారు.ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక సమస్య గురించి ఆలోచిస్తూనే ఉంటారు.
కొందరు వాటిని ఎంతో సులభంగా ఆలోచన చేస్తే, మరి కొంతమంది దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు.ఇలా ఎప్పుడూ ఆలోచించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలా ఆలోచన చేయలేని పక్షంలో మన కుటుంబ సభ్యులను గాని, స్నేహితులను గాని అడిగి తెలుసుకోవడం మంచిది.ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు సంతోషంగా ఉండలేకపోతున్నారు.
దీనివల్ల ఒత్తిడి నుంచి దూరం అవ్వడానికి ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
ఒత్తిడి నివారించేందుకు ప్రతిరోజు వ్యాయామమైన చేయాల్సిందే.ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఒత్తిడి తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు దూరం అవ్వాలంటే ప్రతి రోజు తప్పకుండా కనీసం 30 నిమిషాలు పాటు అయినా వ్యాయామం చేయాలని ఆరోగ్యాన్ని పనులు చెబుతున్నారు.