1.యుఎస్ఏ లో భారతీయుడికి ప్రతిష్టాత్మక EY అంత్ర ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
అమెరికా లో భారతీయ సంతతికి చెందిన కోరా వంశీ అనే ఎన్నారైకి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.ప్రముఖ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ వై ) ఏటా ప్రకటించే ఆంత్రా ప్రెన్యుర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఓహాయో రాష్ట్రానికి చెందిన గతి ఎనలిటిక్స్ వ్యవస్థాపకుడు వంశీ కోరా ఎంపికయ్యారు.
2.డల్లాస్ లో వైభవంగా యోగా

మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో అమెరికాలోని అతిపెద్దదైన డాలస్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3.ఇజ్రాయిల్ లో పార్లమెంటు రద్దు
ఇజ్రాయిల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తి ఆ దేశ పార్లమెంట్ రద్దు కావడంతో ప్రస్తుతం ప్రధాన మంత్రి గా ఉన్న నాప్తాలి బెన్నెట్ సైతం ఆ పదవి నుంచి తొలిగిపోనున్నారు.
4.రాజకీయ ప్రత్యర్ధులకు ఉరిశిక్ష.హెచ్చరించిన యూ యెన్

మయన్మార్ జుంటా ప్రభుత్వం అంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యుడు ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరి తీస్తామని ప్రకటించింది.అయితే ఈ ఆలోచనను విరమించుకోవాలని యూఎన్ హెచ్చరించింది.
5.షిజియాంగ్ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేధం
షిజియాంగ్ వస్తువులపై నేటి నుంచి అమెరికా నిషేదం అమలు కానుంది.
6.పేరు, జెండర్ మార్చాలని ఎలెన్ మాస్క్ కుమారుడి దరఖాస్తు

టెస్లా కంపెనీ ఓనర్ , బిలినియర్ ఎలెన్ మాస్క్ కుమారుడు జేవియర్ తన పేరును, జెండర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.ఈమేరకు కాలిఫోర్నియాలోని సాంబ మోనిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
7.శ్రీలంక లో నేటి నుంచి రెండు వారాల పాటు షట్ డౌన్
శ్రీలంక లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఆ దేశ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. చమురు నిల్వలు వేగంగా తరిగిపోతూ ఉండడం తో వాటిని ఆదా చేసేందుకు అత్యవసర సేవలను సోమవారం నుంచి రెండు వారాలు నిలిపివేసింది.
8.విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
యాంటీ బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
9.కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో విజయం

కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష అభ్యర్థి గుస్తావో పెట్రో ఎన్నికయ్యారు.
10.21 వ రాజ్యాంగ సవరణ కు శ్రీలంక క్యాబినెట్ ఆమోదం
దేశ కార్యనిర్వాహక అధ్యక్షునిగా పార్లమెంటుకు అధికారాలు ఎక్కువగా కల్పించే 21 వ రాజ్యాంగ సవరణ శ్రీలంక మంత్రివర్గం సోమ