ఈరోజు బాహుబలిని మించి ఆ చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కారణం వాల్లే .ఇంతకీ ఏంటా చిత్రం? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? అని ఆరా తీస్తే అది కేజిఎఫ్ లేకపోతే కేవలం డబ్బింగ్ ఆర్టిస్ట్ ల వల్లే ఆ సినిమా అంత రేంజ్ కి వెళ్లిందని, అంత విజయం సాధించిందని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ తెలిపారు.
దామోదర్ రెడ్డి గారు చేసిన ఈ కే జి ఎఫ్ సినిమా కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుల, కేవలం డబ్బింగ్ వాయిసెస్ ల వల్ల మాత్రమే, ఆ సినిమా అంత హిట్టయ్యిందని తాను గంటా పథంగా ఆ విషయాన్ని చెప్పగలనని ఈశ్వర్ తెలిపారు.థియేటర్లో లో ఈ సినిమా చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటుందని అని అన్నారు.
ప్రతి ఒక్కరూ కేజిఎఫ్ గురించి చెప్పుకుంటున్నారు అంటే దానికి కారణం అందరికీ బెస్ట్ వాయిసెస్ ఉండడమే అని ఆయన వివరించారు.ఎవరికీ తగ్గకుండా అందరికీ ది బెస్ట్ వాయిస్ లు ఉన్నాయని ఆయన చెప్పారు.
ఆఖరికి చిన్న పిల్లలకు కూడా మంచి వాయిస్ ను సమకూర్చారని అని దానికి డబ్బింగ్ ను తన కొడుకు కార్తికేయనే చెప్పారని అన్నారు.
ఇక కేజిఎఫ్ 2 విషయానికొస్తే ఆ సినిమా కూడా డబ్బింగ్ పూర్తయిందని ఈశ్వర్ తెలిపారు.
మొదటి సినిమానే ఆ రేంజ్ లో ఉంటే ఇక రెండో సినిమా ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని, ఒక్క మాటలో చెప్పాలంటే అది నా భూతో నా భవిష్యత్ అని ఆయన స్పష్టం చేశారు.ఒక పోలీస్ స్టేషన్ సీన్ అందరికీ రెస్పాన్స్ వచ్చేలాగా ఉంటుందని ఆయన చిన్న హింట్ ఇచ్చారు.
ఇక ఆ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకపోతే సంజయ్ దత్ కి కూడా తాను డబ్బింగ్ చెప్పాలని కానీ వాయిస్ లో ఇంకొంచెం మెచ్యూరిటీ కావాలని బెంగళూరు నుంచి వేరొక డబ్బింగ్ ఆర్టిస్ట్ తో హీరో వాయిస్ చెప్పించాలని ఆయన వివరించారు.