నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.దసరా కానుకగా ఈ సినిమా ను విడుదల చేస్తారని అంతా ఆశించారు.
కాని ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.నిన్న మొన్నటి వరకు ఈ సినిమా సంక్రాంతి విడుదల అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.
కాని ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ఈ సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు.ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ అయిన సినిమాలు కూడా ప్రీ పోన్ లేదా పోస్ట్ పోన్ అవుతాయని అంటున్నారు.
ఈ సమయంలో సంక్రాంతి అఖండ విడుదల అసాధ్యం అంటున్నారు.అందుకే మరీ ఆలస్యం కాకుండా నవంబర్ లో సినిమా ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అఖండ సినిమా ను నవంబర్ లో దీపావళి సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.షూటింగ్ ముగింపు దశకు వచ్చినప్పుడే ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వాలనుకున్నారు.కాని కరోనా పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో అర్థం కాక పోవడం వల్ల విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.దీపావళికి ఈ సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు.బాలయ్య అభిమానులు అఖండ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించడంతో ఆసక్తి మరింతగా పెరిగింది.బాలయ్య మరియు బోయపాటి కాంబో లో హ్యాట్రిక్ గా ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.