తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.అందుకే చాలా మంది తేనెను డైట్లో చేర్చుకుంటుంటారు.
కొందరు ఉదయాన్నే వేడి నీటిలో తేనెను కలిపి తీసుకుంటుంటారు.తేనెలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.
ఇవి ఆరోగ్య పరంగానూ, సౌందర్య పరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.అయితే తేనె ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా తేనెను డైట్లో చేర్చుకుంటారు.ఎందుకంటే తేనె వెయిట్ లాస్లో గ్రేట్గా సహాయపడుతుంది.కానీ, అదే తేనెను అతిగా తీసుకుంటే అందులో ఉండే కేలరీలు బరువు పెరిగేలా చేస్తాయి.డయాబెటిస్ వ్యాధి ఉన్న వారిలో చాలా మంది షుగర్కు బదులుగా తేనెను ఉపయోగిస్తుంటారు.
ఇలా చేయడం మంచిదే.అయినప్పటికీ, మధుమేహం వ్యాధి గ్రస్తులు తేనెను అతిగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.
అలాగే తేనెను మోతాదు మించి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి.ముఖ్యంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.ఇక అతిగా తేనెను తీసుకోవడం వల్ల దంత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదెలా అంటే తేనె తరచూ తీసుకోవడం వల్ల అది పళ్లకు అంటుకునిపోయి బ్యాక్టీరియా ఏర్పడుతుంది.ఆ బ్యాక్టీరియా కారణంగా దంత సమస్యలతో పాటు చిగుళ్ల సమస్యలు కూడా ఏర్పడతాయి.
కాబట్టి, తేనెను అతిగా మాత్రం ఎప్పుడూ తీసుకోకండి.ఏ ఆహారం అయినా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
అతిగా తీసుకుంటే ఆరోగ్యానికే చేటు.ఇందుకు తేనె కూడా ఏ మాత్రం మినహాయింపు కాదు సో బీ కేర్ఫుల్!
.