భారతదేశం సినీ పరిశ్రమలలో చాలా మంది హీరోహీరోయిన్లు వారి కుటుంబ వారసత్వ నేపథ్యంలో భాగంగా టాప్ హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.అలాంటి వారికి ఓ సినిమా ప్లాప్ అయినా సరే మరి కొన్ని అవకాశాలు వచ్చి పడుతూనే ఉంటాయి.
దీంతో ఇంట్లోని చిత్ర బృందం సభ్యులు వారిని చిత్ర పరిశ్రమలో నిలబెట్టేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు.అయితే అందరి పరిస్థితి అలా ఉన్న మరో వారసుడు పరిస్థితి మాత్రం కాస్త భిన్నంగా ఉంది.
ఆయనకు మంచి సినిమాలు ఉన్న కానీ, మంచి మార్కెట్ ఉన్న దాన్ని అతడు కేవలం 35 సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక తాను సినిమాల్లో నటించడం చాలని అనుకుంటున్నాడు.నిజానికి 35 సంవత్సరాలు వస్తే. అంతర్జాతీయ క్రీడా రంగాలకు సంబంధించి రిటైర్మెంట్ ప్రకటించారు కానీ సినిమాల్లో మాత్రం అలా అంటూ ఏమీ ఉండదు.
ఈ విధంగా చేసింది ఎవరు అంటే బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్.ఇమ్రాన్ ఖాన్ 1988లో బాలనటుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత 2008లో ఆయన హీరోగా మారాడు.
జానే తు యా జానేనా అనే సినిమాతో భారీ విజయం అందుకని బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నాడు.మొదటి సినిమాలోనే దక్షిణ భారతదేశ సినీ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ జెనీలియా తో కలిసి మాస్ బాగా రొమాన్స్ చేసి ఆ సినిమాను భారీ విజయం సాధించాడు.
ఆ తర్వాత తన మేనమామ అమీర్ ఖాన్ తో కలిసి ఢిల్లీ బెల్లి సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
ఇలా చివరగా ఆయన కంగనా రనౌత్ తో కలిసి 2015లో కట్టి బట్టి అనే సినిమాతో నటించిన తర్వాత ఆయన మరో సినిమాలో కనిపించలేదు.సినిమా ఇండస్ట్రీలో ఉన్న మిగితా వారసుల కంటే ఈయన కెరీర్ బాగానే కొనసాగుతున్న కాని ఆయన సినిమాల నుంచి దూరమవుతున్నట్లు ప్రకటించడంతో బాలీవుడ్ లో కాస్త హాట్ టాపిక్ గా మారింది.ఇకపోతే అందరూ.
ఇమ్రాన్ సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకున్నాడు ఏమో అనుకున్నారు.కానీ, రిటైర్ అవుతారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు.
అయితే సినిమాల్లో నటించకపోయినా దర్శకత్వంలో అడుగుపెట్టాలని అందుకు సంబంధించి కథలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.అంతేకాదు సరైన కథ దొరికితే తన మేనమామను సినిమా హీరోగా పెట్టి డైరెక్ట్ చేస్తానని తెలుపుతున్నాడు ఇమ్రాన్ ఖాన్.
చూడాలి మరి ఆ రోజు ఎంత తొందరగా వస్తుందో.