కింగ్ నాగార్జున హోస్ట్గా ఇటీవల ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 రోజు రోజుకు రంజుగా సాగుతోంది.ఇంటి సభ్యులందరూ టాస్కుల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా పోటా పోటీగా తలపడుతున్నారు.అయితే ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు `కొంటె రాక్షసులు- మంచి మనుషులు` అనే టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్లో రాక్షసులైన అరియానా, అవినాష్, హారిక, మెహబూబ్, అఖిల్లు.మనుషులకు చుక్కలు చూపించారు.
ముఖ్యంగా అరియానా నిజమైన రాక్షసిగా చెలరేగిపోయింది.మనుషులను ముప్ప తిప్పలు పెట్టి.నరకం చూపించింది.ఇక ఇప్పటికే హారిక, అఖిల్లు మనుషులుగా మారిపోగా.
నిన్నటి ఎపిసోడ్లో రాక్షసులను మనుషులుగా మార్చుకునేందుకు బిగ్ బాస్ మరిన్ని టాస్క్లు ఇచ్చారు.అయితే రాక్షసుల టీంలో మెహబూబ్, అరియానా, అవినాష్ ముగ్గురు ఉన్నప్పటికీ.
ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.మనుషులు చేసే టాస్కులను చెడగొడుతూ.
మనుషులకు ముచ్చెమటలు పట్టించారు.అలాగే అరియానా.
సోహైల్, అఖిల్ షూలను ఎక్కడపడితే అక్కడ విసిరేసింది.పైగా అఖిల్తో సారీ చెప్పించుకుంది.
మరోవైపు మెహబూబ్, అవినాష్లు కూడా ఇంటిని చిందరవందరగా మార్చేశారు.అయితే చివరకు తీవ్ర పోటీ మధ్య మనుషులు విజేతలుగా నిలిచారు.
టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఇంటి సభ్యులను అభినందించిన బిగ్ బాస్.ఇద్దరు బెస్ట్ పెర్ఫామర్లను మరియు ఇద్దరు వరస్ట్ పెర్ఫామర్లను చెప్పాలని కోరారు.
అయితే బెస్ట్ పెర్ఫామర్లగా అరియానా, అవినాష్ల పేర్లు చెప్పగా.వారిద్దరూ కెప్టెన్ పోటీదారులుగా ఎంపిక అయ్యారు.అయితే వీరిలో రాక్షసిగా నరకం చూపించిన అరియానాను కెప్టెన్ చేయాలని ఇంటి సభ్యులు ఫిక్స్ అయ్యారు.ఇక అరియానా, అవినాష్లకు బండి తొయ్యరా బాబూ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారో ఈ రోజు తెలియనుంది.ఒకవేళ ఇంటి సభ్యులు కోరుకున్నట్టు అరియానా కెప్టెన్ అయితే.
ఈ వారం ఎలిమినేషన్ నుంచి వచ్చే వారం నామినేషన్ నుంచి సేఫ్ అవుతుంది.