మల్బరీ పండ్లు..
చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు.అసలు వాటివైపే చూడరు.
కానీ, ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలను అందించే పండ్లలో మల్బరీ పండ్లు కూడా ఉన్నాయి.మల్బరీ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే ఈ పండ్లును డైట్లో ఉంటే అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చని అంటుంటారు.మరి ఇంతకీ మల్బరీ పండ్లను తినడం వల్ల ఏ ఏ ప్రయోజనాలు అందుతాయో ఓ చూపు చూసేయండి.

ఈ మధ్య కాలంలో ముసలి వారిలోనే కాదు.చిన్న వయసు వారిలో సైతం కంటి చూపు మందగిస్తోంది.అయితే కంటి ఆరోగ్యానికి మల్బరీ పండ్లు ఎంతగానో తోడ్పడతాయి.వారంలో కనీసం మూడు, నాలుగు సార్లు మల్బరీ పండ్లను తింటే కంటి చూపు పెరగడంతో పాటు ఇతర కంటి సంబంధిత సమస్యలేమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.
అలాగే అధిక రక్త పోట బాధితులకు మల్బరీ పండ్లు ఓ వరంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే, రక్త పోటు స్థాయిలను తగ్గించడంలో మల్బరీ పండ్లు గ్రేట్గా సహాయపడతాయి.
కాబట్టి, హైబీపీ ఉన్న వారు మల్బరీ పండ్లు తీసుకుంటే చాలా మంచిది.చర్మ ఆరోగ్యానికీ మల్బరీ పండ్లు ఎంతో మేలు చేస్తాయి.
అవును, వీటిని తీసుకుంటే చర్మానికి పోషకాలన్నీ అందుతాయి.

అంతే కాదండోయ్.మల్బరీ పండ్లను తినడం వల్ల ఎముకలు, దంతాలు గట్టిగా మారతాయి.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
పలు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.కాలేయ సంబంధిత సమస్యలేమైనా ఉంటే తగ్గుతాయి.
మరియు రక్తంలోని చక్కెర స్థాయిలు సైతం కంట్రోల్ అవుతాయి.కాబట్టి, ఇకపై మల్బరీ పండ్లు కనిపిస్తే అస్సలు వదిలి పెట్టకండి.