మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాలీవుడ్ లో తనకి తిరుగులేదని మరోసారి రుజువు చేసుకున్నాడు.ఇక నెక్స్ట్ సినిమాని తారక్ తో మళ్ళీ ప్లాన్ చేశాడు.
ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి తారక్ బయటకి రావడానికి ఏడాదికి పైగా పట్టేస్తుంది.
కరోనా కారణంగా షూటింగ్ లు వాయిదా పడటంతో ఆ ప్రభావం ఆర్ఆర్ఆర్ మీద కూడా పడింది.ఇదిలా ఉంటే తారక్ తో సినిమా కంటే ముందు త్రివిక్రమ్ మినిమం బడ్జెట్ సినిమా ప్లాన్ చేసుకున్నాడు అని టాక్ నడుస్తుంది.
గతంలో నితిన్ తో అఆ తీసినట్లు ఈ సారి నానితో ఒక ఎంటర్టైనర్ తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేశారని సమాచారం.ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది అని చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని త్రివిక్రమ్ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం.నానీ కి అక్కపాత్రలో ఆమెని తెలుగుకి పరిచయం చేయాలని ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం.
ఆమె పాత్ర చుట్టూ కథ తిరిగుతుందని, ఈ కారణంగానే హీరోయిన్ రేంజ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలని విద్యాబాలన్ కి త్రివిక్రమ్ ఓటు వేసినట్లు టాక్.ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి అని హారిక అండ్ హాసిని బ్యానర్ లోనే ఈ సినిమాను కూడా చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
మరి ఈ వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే త్రివిక్రమ్ నుంచి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.