తెలుగు రాష్ట్రాల్లో నిన్న నమోదయిన కొత్త కేసులు, మొత్తం కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్నా కూడా కరోనా పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గుముఖం పట్టక పోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 In Telugu States Corona Positives Telugu States, Corona Virus, India, Lock Down,-TeluguStop.com

నిన్న కూడా తెలుగు రాష్ట్రాల్లో కలిపి కరోనా పాజిటివ్‌ ల కేసులు భారీగా పెరిగాయి.మొత్తం సంఖ్య కూడా భయాందోళన కలిగించే విధంగా ఉంది అంటూ అధికారులు అంటున్నారు.

నిన్న తెలంగాణలో కొత్తగా 62 కేసులు నమోదు అయ్యాయి.దాంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల కేసుల సంఖ్య 333కు చేరింది.అయితే నిన్న కరోనా నెగటివ్‌ రావడంతో 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఇక ఏపీలో నిన్న ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు 26 కేసులు నమోదు అయ్యాయి.

ఈ కేసులు అన్నీ కూడా కర్నూలు జిల్లాలోనే కావడం ఆందోళన కలిగించే విషయం.మొత్తంగా ఏపీలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 252 కు చేరింది.

లాక్‌ డౌన్‌ నియమాలను కొందరు ఉల్లంఘించడంతో పాటు నిజాముద్దీన్‌ సంఘటన కారణంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube