బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే.రన్ రాజా రన్ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటిన సుజిత్, సాహో వంటి బిగ్ బడ్జెట్ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ఆయన ట్యాలెంట్ను యావత్ సినీ ఇండస్ట్రీ మెచ్చుకుంది.
ఇక సాహో ప్రభాస్ కెరీర్లో హిట్ చిత్రంగా నిలిచింది.అయితే ఈ సినిమా తరువాత సుజిత్ తన నెక్ట్స్ మూవీని ఇంకా అనౌన్స్ చేయలేదు.
కాగా సుజిత్ ట్యాలెంట్కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకర్షితుడై అతడితో సినిమా చేయాలనుందని అన్నాడు.దీనికి సంబంధించి స్క్రిప్టు పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రామ్ చరణ్ సుజిత్ను పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాడనే వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాతో రామ్ చరణ్ మరో పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ మరే ఇతర ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది.
అటు సుజిత్ కూడా తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై సైలెంట్గా ఉన్నాడు.
వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అప్పుడే సినీ వర్గాల్లో మొదలైంది.ఈ సినిమాతో సుజిత్ ఎట్టిపరిస్థితుల్లో బ్లాక్బస్టర్ హిట్ను కొట్టాలని చూస్తున్నాడు.
మరి ఈ కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్.