కుటుంబంలో చర్చలు, గొడవలు సాధారణమే అయినా.ఆవేశం అదుపుతప్పినప్పుడు పర్యవసానం ఎంత భయానకంగా మారుతుందో మధ్యప్రదేశ్లోని( Madhya Pradesh ) గ్వాలియర్లో చోటు చేసుకున్న తాజా ఘటన స్పష్టంగా చూపిస్తుంది.
వృద్ధ అత్తపై( Mother-In-Law ) కోడలు( Daughter-In-Law ) దాడి చేసిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.జనం మానవత్వాన్ని మరిచిపోతున్నారా అన్న ప్రశ్నను ఈ ఘటన మళ్లీ ముందుకు తెచ్చింది.వీడియో సాక్ష్యాలతో వైరల్గా మారిన ఈ ఘటన బాధ్యతారహిత, క్రూరంగా కుటుంబ సంబంధాల పతనాన్ని వెల్లడిస్తోంది.70 ఏళ్ల వృద్ధురాలు సరళ బాత్రా( Sarala Batra ) పై ఆమె కోడలు నీలిమ, నీలిమ కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు.నీలిమ, తన తల్లితండ్రులు, సోదరుడితో కలిసి విశాల్ బాత్రా (తన భర్త)( Vishal Batra ) పై, అతని తల్లి సరళపై దాడి చేసింది.ఆమెను వృద్ధాశ్రమానికి పంపాలన్న కోరికకు అంగీకరించకపోవడం వల్ల ఈ ఘోర ఘటన జరిగింది.
బాధితుడు విశాల్ బాత్రా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించగా, నీలిమ( Neelima ) గత ఏడాది నుండి తన తల్లిని ఇంటి నుంచి పంపించాలంటూ ఒత్తిడి చేస్తోందని తెలిపారు.తల్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన అంగీకరించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయని చెప్పారు.ఒక రోజు నీలిమ తన తండ్రి, సోదరుడిని ఇంటికి పిలిపించి దాదాపు 10-15 మంది వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి తల్లీకొడుకులపై దాడి చేసినట్లు తెలిపారు.విశాల్ పై నీలిమ సోదరుడు దాడి చేయగా, కోడలు నీలిమ తన అత్తను జుట్టు పట్టుకుని నేలపైకి లాగుతూ, తాళాలు రాయడం వంటి దాడులు చేసింది.
బాధితురాలు సరళ బాత్రా మాట్లాడుతూ, నీలిమ చాలా రోజులుగా నన్ను మానసికంగా వేధిస్తూ ఉంది.కానీ, నా కొడుకు ఇబ్బంది పడకూడదనే మౌనంగా ఉన్నాను.ఈసారి కొడుకు ముందే నన్ను వాళ్లు కొట్టారు.దీంతో నేను సహించలేకపోయానని చెప్పింది.దాడికి గురైన తర్వాత తల్లీకొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అదే సమయంలో పోలీస్ స్టేషన్లోనూ నీలిమ తండ్రి, సోదరుడు వారిని చంపుతామని బెదిరించినట్లు వారు ఆరోపించారు.
ఈ ఘటనపై స్పందించిన సీఎస్పీ రాబిన్ జైన్, బాధితురాలైన సరళ బాత్రా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలతో ఈ ఘటనపై ప్రజా ఆగ్రహం పెరుగుతోంది.
ఇలాంటి ఘటనలు మానవత్వం ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్నను మన ముందుంచుతున్నాయి.
వృద్ధులను గౌరవించడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం.ఒక వృద్ధ తల్లి తన సొంత ఇంట్లో, తన కోడల చేతిలో అవమానాలకు గురై.
దాడి చేయబడిన ఘటన ఎంతో బాధాకరం.బాధితులకు న్యాయం జరగాలని, బాధ్యులు శిక్షింపబడాలని సమాజం ఆశిస్తోంది.