కరోనా సమయంలో ఓటీటీలకు ఎంతో మంచి ఆదరణ పెరిగిపోవడంతో ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్ లు ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇక థియేటర్లో విడుదలైన సినిమాలు కూడా కొన్ని వారాలలోనే ఓటీటీలో విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏకంగా ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక సంక్రాంతి బరిలో పోటీకి దిగిన సినిమాలలో తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సినిమా ఒకటి.

ఈ సినిమాలో హీరో విజయ్ సరసన రష్మిక నటించగా వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమాని దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు తమిళ భాషలలో నిర్మించారు.ఈ సినిమా మొదటినుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వస్తోంది అయితే విడుదల విషయంలో కూడా ఈ సినిమాని జనవరి 11వ తేదీ విడుదల చేస్తానని దిల్ రాజు ప్రకటించడంతో మరికొన్ని వివాదాలు ఎదురయ్యాయి.దీంతో చేసేదేమిలేక తమిళంలో పదకొండవ తేదీ విడుదల చేసినప్పటికీ తెలుగులో 14వ తేదీ ఈ సినిమా విడుదలైంది.

ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం మంచి దూకుడుని కనబరిస్తోంది.ఇక ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గురించి పలు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది.
త్వరలోనే ఈ విషయం గురించి అధికారక ప్రకటన వెలువడనుంది.