కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందనడానికి ఈ బడ్జెటే నిదర్శనమని విమర్శించారు.
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన పన్ను మినహాయింపుల వలన ఎవరికీ ఉపయోగం లేదని పేర్కొన్నారు.తెలంగాణలో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు అందిస్తున్నామని ఆమె తెలిపారు.
అనంతరం కేంద్ర బడ్జెట్ అన్ని రాష్ట్రాలకు కాదన్న కవిత… కొన్ని రాష్ట్రాలకేనని వెల్లడించారు.బీజేపీ పాలిత రాష్ట్రాలకు, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ వలన ప్రయోజనం ఉందని ఆరోపించారు.