భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆడే భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.వికెట్ కీపర్లుగా ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు.
అక్టోబర్ ఐదు న ప్రారంభం అయ్యే వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా.హార్థిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు.అయితే ఈ జట్టులో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజూ శాంసన్ తో పాటు కొంతమంది స్టార్ ప్లేయర్లకు బీసీసీఐ సెలెక్టర్లు మొండి చెయ్యి చూపించారు.ఆ దురదృష్ట ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
శిఖర్ ధావన్:
ఇతను లెప్టార్మ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్. భారత్ తరపున 137 వన్డేలలో ఆడి 6793 పరుగులు చేశాడు.కానీ వన్డే వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో శిఖర్ ధావన్ కు( Shikhar Dhawan ) చోటు దక్కలేదు.
రవిచంద్రన్ అశ్విన్:
భారత్ తరపున 113 వన్డే మ్యాచ్లలో ఆడి 151 వికెట్లు తీశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో కచ్చితంగా అశ్విన్ కు చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ బీసీసీఐ రవిచంద్రన్ అశ్విన్ కు మొండి చేయి చూపించింది.
భువనేశ్వర్ కుమార్:
భారత్ తరపున 121 వన్డే మ్యాచ్లు ఆడి 141 వికెట్లు తీశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని భావించాడు కానీ బీసీసీఐ భువనేశ్వర్ కుమార్ ఎంపికను పరిగణలోకి తీసుకోలేదు.
యుజ్వేంద్ర చాహల్:
భారత్ తరపున 72 వన్డే మ్యాచ్లు ఆడి 121 వికెట్లు తీశాడు.ఈసారి వన్డే ప్రపంచ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
కానీ జట్టులో చోటుదొక్కలేదు.
సంజూ శాంసన్:
భారత్ తరపున 13 మ్యాచ్లలో 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు.వన్డే వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు దక్కుతుందని భావించాడు కానీ మళ్లీ నిరాశే ఎదురైంది.