ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్ఉపడు తాలిబనల్ఉ ఏ రేంజ్లో దారుణాలు సృష్టిస్తున్నారో చూస్తేనే ఉన్నాం.వీరి దాడులకు భయపడిపోయి ఆ దేశంలో వేలాది మంది దేశం విడిచి పారిపోతున్నారు.
ఇక వారు ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యం మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు తమ రాక్షస పాలనకు తెర లేపుతున్నారు.మామూలుగానే వీరి పాలన అంటే మహిళలను దారుణంగా హింసిస్తారు.
కాగా ఇప్పుడు వారిమీద వస్తున్న ఆరోపణలతో తాము గతానికి భిన్నంగా మారిపోయామని గతంలో మాదిరిగా హింసకు పాల్పడబోమంటూ నీతులు చెబుతన్నారు.
కానీ వారి మాటలకు వారు చేస్తున్న రాక్షస పాలను అసలు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఇప్ఉపడు మహిళల విద్యాబోధనకు సంబంధించిన విషయంలో తాలిబన్లు దార/ణమైన నిర్ణయం తీసుకున్నారు.ఈ నిరణయంతో అక్కడ ఉంటున్న యువతుల, అలాగే బాలికల పాలిట శాపంగా ఉందనే చెప్పాలి.
ఈ నిర్ణయంపై ప్రపంచ విద్యావేత్తలు తీవ్ర ఆందోళనను కనబరుస్తున్నారు.ఇందులో భాగంగా గతవారమే ఆ దేశఃలో కో-ఎడ్యుకేషన్ విధానాన్ని పూర్తిగా తాలిబన్లు నిషేధించారు.
అంటే ఆ దేశంలో ఇకపై అమ్మాయిలు అబ్బాయిలతో పాటు కలిసి చదువుకోవద్దన్నమాట.
ఇక దీనికి తోడుగా ఇప్పుడు ఆడపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో చదువు చెప్పడానికి మగ టీచర్లను అనుమతించబోమంటూ చెప్పేశారు.
ఇక ఈ ఆదేశాలను షరియా చట్టం ప్రకారం అన్ని విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలంటూ చెబుతున్నారు తాలిబనల్ఉ.ఈ కారణంగా బాలికలను రాబోయే కాలంలో ఉన్నత విద్యకు దూరం అవుతారని ప్రపంచ విద్యావేత్తలు తీవ్ర ఆదేవన వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్ఉడున్న పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ లో అసలు పై స్థాయి విద్యను అందించే స్థాయిలో మహిళా లెక్చరర్లు లేకపోవడమే అందుకు కారణం.ఈ కారణంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ యువతులకు పెద్ద ప్రమాదమే రాబోతోంది అని తెలుస్తోంది.