రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం ఎంతో ఘనంగా విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది.మొదటి రోజే పెద్దఎత్తున అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకుని తమ అభిమాన హీరోల కటౌట్ లకు పాలాభిషేకాలు చేయడం బాణసంచాను కాల్చడం వంటి వాటి ద్వారా వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇక పోతే మొదటి రోజే ఈ సినిమాని చూడటం కోసం పెద్దఎత్తున సెలబ్రిటీలు సైతం థియేటర్లకు వెళ్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాని అభిమానులతో కలిసి చూడటం కోసం బెనిఫిట్ షో కి ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి థియేటర్ కు చేరుకున్నారు.
ఇక ఈ సినిమాకి మొదటి నుంచి తెలంగాణ సర్కార్ అన్ని విషయాలలోనూ సపోర్ట్ గా నిలబడింది.ఈ క్రమంలోనే ఈ సినిమాని చూడటం కోసం సీనియర్ డ్రైవర్ ను నియమించి ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని థియేటర్ల దగ్గరకు తీసుకెళ్లడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ఇతర చిత్ర బృందం సభ్యులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే థియేటర్ కు చేరుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆర్ఆర్ఆర్’ టీం సేఫ్టీని ఉద్ధేశించి ఆర్టీసీ సంస్థ ప్రత్యేకంగా ఏసీ బస్సులను ఏర్పాటు చేయడంతో దర్శకుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.నిరంతరం మీరు మమ్మల్ని సహకరించడాన్ని మేము గౌరవిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు.