నేడు గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ..!

లోక్ సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan )లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.

 Telangana Pradesh Election Committee Meeting At Gandhi Bhavan Today..!, Telangan-TeluguStop.com

పీఈసీ కమిటీ ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని నిర్వహించనున్నారు.అలాగే ఈ భేటీకి ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పీఈసీ సభ్యులు హాజరుకానున్నారు.ఇందులో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు.ఇప్పటికే కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను డీసీసీ అధ్యక్షులు పీఈసీ కమిటీకి పంపారు.ఈ క్రమంలో డీసీసీలు పంపిన జాబితాలో పేర్లను పీఈసీ పరిశీలించి తరువాత అర్హులైన అభ్యర్థుల పేర్లతో ఫైనల్ గా మరో జాబితాను సిద్ధం చేయనుంది.ఆ జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Central Election Committee )కి సిఫారసు చేయనుంది.

వచ్చే నెల 5, 6 వ తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జాబితాలపై చర్చించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube