బీహార్లోని సివాన్ జిల్లా మహారాజ్గంజ్లో నేటికీ దేవాలయం ఎక్కడా కనిపించదు.ఇక్కడ దేవతా విగ్రహాలను బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు.
ఈ గ్రామం పేరు సుర్వీర్.ఇక్కడ గుడి కట్టాలని ఎవరు ప్రయత్నించినా పాము కాటుకు గురై, మరణిస్తారని స్థానికులు చెబుతుంటారు.
దీని గురించి గ్రామానికి చెందిన అనుజ్ పాండే మాట్లాడుతూ చాలా సంవత్సరాల క్రితం మా తాతగారు సుర్వీర్.గ్రామంలో శివాలయాన్ని నిర్మించడానికి పునాది వేయాలని అనుకున్నారు.
అయితే ఆయన పాము కాటుకు గురై చనిపోయారు.అప్పటి నుండి ఎవరైనా ఇక్కడ ఆలయం నిర్మించాలని ప్రయత్నిస్తే, ఇటువంటి ఘటనలే జరిగాయి.
చాలా మంది ఇక్కడ పాముల జంటను చూశారు.గ్రామానికి చెందిన ప్రకాష్ పాండే మాట్లాడుతూ ఈ జంట పాములు గ్రామంలోని ఒక చెట్టుదగ్గర ఉన్నాయని.
అవి ఎవరికీ హాని చేయవని తెలిపారు.అయితే ఎవరైనా గ్రామంలో గుడి కట్టాలనుకుంటే వారిని ఆ పాముల జంట కాటువేస్తుందన్నారు.ఈనాటికీ గ్రామంలోని మహిళలు శివుని విగ్రహం ఉన్న స్థలానికి వచ్చి పూజలు చేసేందుకు వస్తారని ఆయన చెప్పారు.అయితే గ్రామంలోని వారంతా ఈ నాగ జంటకు భయపడతారు.
చాలాకాలంగా గ్రామంలో గుడి నిర్మించాలనే చర్చ వచ్చినప్పుడల్లా కొన్ని ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.కాగా గ్రామంలో కొలువైన శివుడిని సందర్శించుకుంటే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని స్థానికులు నమ్ముతారు.
కాగా గ్రామంలోని 8 ప్రదేశాలలో దేవతల విగ్రహాలు బహిరంగంగా దర్శనమిస్తాయి.