లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ అశేషమైన సేవా కార్యక్రమాలు చేసాడు.సినిమాల్లో విలన్ గా కనిపించే ఆయన రియల్ లైఫ్ లో నిజమైన హీరోలా ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాడు.
ఈ విషయాన్ని శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల తనయుడు అయిన వియాన్ రాజ్ కుంద్రా గమనించాడు.సోనూసూద్ లో అతనికి ఒక నిజమైన సూపర్ హీరో కనిపించాడు.
అందుకే అతని స్కూల్ “ప్రాజెక్ట్ లో వైవిధ్యం చూపిన వ్యక్తులు” అనే పేరు తో ఒక ప్రాజెక్ట్ తయారుచేశాడు.ఇందులో సోనూసూద్ లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను చూపించారు.
దీనికోసం తయారుచేసిన యానిమేషన్ వీడియో ను శిల్ప తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ సోనూసూద్ కి అంకితం అని తెలిపింది.
శిల్ప స్పందిస్తూ ఇటీవల కొద్దికాలంగా ప్రపంచమంతటా జనాలు బయటకు రావడానికి బయపడుతుంటే సోనూసూద్ మాత్రం ప్రజలకు సహాయం చేయాలి అనే ఆలోచనతో కరోనా కు భయపడకుండా తాను ప్రజలకి చేయాలి అనుకున్న సేవ చేసాడని.
ఇప్పటికీ అతని సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.వలస కార్మికుల కోసం సోనూసూద్ పడ్డ శ్రమ దేశం మర్చిపోలేనిది, వియాన్ కూడా ఈ విషయం లో సోనూసూద్ కి ఫ్యాన్ అయ్యాడు అని శిల్ప పేర్కొంది.