భారీ అంచనాల మధ్య విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజిలో సందడి చేస్తోంది.ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుంది.
ఎన్నో అంచనాలతో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా చివరికి ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చింది.ఇక మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది.
ఇక ఈ సినిమాకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు అటు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అన్ని ఇండస్ట్రీలలో కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.
ఇక త్రిబుల్ ఆర్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్రబృందం సంతోషం లో ఉండిపోయింది.అయితే త్రిబుల్ ఆర్ వర్సెస్ రాధేశ్యామ్ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లా నాయక్ సినిమాల బాక్సాఫీస్ సందడి చూస్తే.
భీమ్లా నాయక్ పుష్ప సినిమాల కలక్షన్ కంటే త్రిబుల్ ఆర్ ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు పుష్ప 16.30 కోట్లు షేర్ రాబడితే భీమ్లా నాయక్ 19.80 కోట్లు.రాధేశ్యామ్ 21.14 కోట్లు వసూలు చేస్తే ఇక త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం ఏకంగా 26.14 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం గమనార్హం.
ఇక ఓవరాల్ కలెక్షన్స్ను చూసుకుంటే మాత్రం పుష్ప మొదటిరోజు 22 కోట్ల నుంచి 24 కోట్ల వరకు వసూలు చేస్తే భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు 27 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.ఇక రాధేశ్యామ్ సినిమా మొదటిరోజు 36 కోట్ల షేర్ అందుకోవడం గమనార్హం.ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ సినిమా విషయానికొస్తే దాదాపు 53 కోట్ల వరకు షేర్ రాబట్టింది.
ఇక ఇటీవలే విడుదలైన స్టార్ హీరోల సినిమాలు అన్నీ చూసుకుంటే మొత్తంగా త్రిబుల్ ఆర్ సినిమా మాత్రం రెట్టింపు విజయాన్ని సాధించింది అని చెప్పాలి.