కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైంది.ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ( Sonia Gandhi, Rahul Gandhi )తో కలిసి పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
న్యాయ్ పత్ర( Nyay Patra ) పేరుతో మొత్తం 48 పేజీలతో మ్యానిఫెస్టోను రూపొందించారు.ఐదు న్యాయ పథకాలతో పాటు 25 హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను తయారు చేసింది.ఎన్నో కసరత్తులు చేసిన తరువాత మ్యానిఫెస్టో తయారు చేశామని ఆ పార్టీ నేత చిదంబరం తెలిపారు.ఈ క్రమంలోనే మోదీ పాలనలో వృద్ధి లేదన్న చిదంబరం యూపీఏ హయాంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు.గత పదేళ్లలో జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతంగానే ఉందని వెల్లడించారు.