ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
భారీ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు.
అంతటా ఒకేలాగా అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్ల వేట కొనసాగిస్తుంది.ఈ సినిమా విడుదల అయినా రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన నటీ నటుల రెమ్యునరేషన్ గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్, రష్మిక మిగతా కాస్ట్ మొత్తం రెమ్యునరేషన్ ఎంత ఉంటుందా అని అందరు ఆరా తీస్తున్నారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకున్నాడని తెలుస్తుంది.
ముందుగా ఆయన లాభాలలో వాటా తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది.
కానీ తర్వాత సినిమా కోసం అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.
పుష్పరాజ్ ఈ సినిమా కోసం దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడట.ఇంకా రష్మిక మందన్న ఈ సినిమాకు 8 కోట్ల నుండి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుందని సమాచారం.
ఇక పుష్ప లో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ ఈ సినిమాకు 3 కోట్ల 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నాడట.
ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం రూ.3.5 కోట్లు, స్పెషల్ సాంగ్ లో చిందేసిన సమంత రూ.1.5 కోట్లు, డైరెక్టర్ సుకుమార్ 25 కోట్లు అందుకున్నారని టాక్.ఇక విలన్ రోల్ లో మెరిసిన అనసూయ రోజుకు 2 లక్షల దాకా వసూలు చేసిందట.మొత్తానికి వీరి రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.