ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.సుకుమార్ డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.
బాలీవుడ్ లో సైతం విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.ప్రొమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్ల మార్క్ టచ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.
అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు.
ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు దాటినా ఇంకా పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేయలేదు.
ఎందుకు ఆలస్యం అయ్యిందో తెలియదు కానీ ఇంకా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక పోవడంతో ఈ సినిమా కోసం అందరు ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ గురించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జులై చివరి వారం నుండి షూట్ స్టార్ట్ చేయబోతున్నారట.అలాగే స్టార్ట్ చేసినప్పటి నుండి ఎలాంటి అడ్డంకులు లేకుండా సుకుమార్ ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని టాక్ అయితే వస్తుంది.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు రిలీజ్ అవుతుందో.