T20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజేత అవుతుందని క్రికెట్ అభిమానులంతా అనుకున్నారు.కానీ సెమిస్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది.
ఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు.ఇక ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ ఫై ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.12 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ను గెలుచుకొని సరికొత్త చరిత్రను లిఖించింది.స్టార్ బ్యాట్స్మెన్ బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీ (52)తో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పాకిస్థాన్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి విజయం సాధిచింది.దీంతో రెండోసారి వరల్డ్ కప్ను తన ఖాతాలో వేసుకుంది ఇంగ్లండ్.
ఇక ఫైనల్ లో విజయం సాధించడం తో ఇంగ్లండ్కు ఫైనల్ మ్యాచ్ గెలిచిన జట్టుకి 13 కోట్లు ప్రైజ్ మనీ.మొత్తంగా టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్ మనీ 45.68 కోట్లు అందిస్తున్నారట.అలాగే రన్నరప్గా నిలిచిన పాకిస్థాన్ రూ.6.5 కోట్లు అందుకోనుంది.ఇక ఇంగ్లండ్తో జరిగిన సెమీ-ఫైనల్లో ఘోర పరాజయం పాలైన టీమ్ ఇండియా టీ20 జట్టులో కీలక మార్పులు రానున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక సెమీ ఫైనల్ దాకా వచ్చ్ ఓడిన భారత్, న్యూజిలాండ్లకు 32.63 లక్షలు రూపాయలు అందుకోనున్నారు.