ఇటీవల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన ప్రకాష్ రాజ్ తాను ఎంపీ గా పోటీ చేయబోతున్నాను అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఎక్కడ నుంచి ఆయన పోటీ చేయబోతున్నాడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.తాజాగా… ఆయన తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ అయితే ఇచ్చేసాడు.ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తానని ట్విట్టర్ లో వెల్లడించారు.
తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయననీ… స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని తెలిపారు.ఈ కొత్త ప్రయాణంలో తనను ప్రోత్సహిస్తున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు.కర్ణాటక ప్రజలు తనను గెలిపించి అక్కున చేర్చుకుంటారని వెల్లడించారు.అన్ని విషయాలన్నీ త్వరలో మీడియాకు వెల్లడిస్తానని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.