టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి ( Rajamouli )!ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా భారీ స్థాయిలో వర్క్ అవుట్ చేయడమే కాకుండా ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నారు.గత కొంతకాలంగా మహేష్ బాబు తన లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి మనకు తెలిసిందే.

మరి కొద్ది రోజులలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాని రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో కాకుండా ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నహాలు చేస్తున్నారు.అందుకు అనుగుణంగానే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు .ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ నటించబోతున్నారు అనే విషయం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ నటి నటించబోతున్నారంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే ఛాన్స్ బాలీవుడ్ బ్యూటీ అందుకున్నారని తెలుస్తోంది.లక్కీ బ్యూటీ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ( Janhvi Kapoor )ను హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఈ వార్తలలో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే ఈమె రామ్ చరణ్ ( Ramcharan ) బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కమిట్ అయ్యారు అలాగే ఎన్టీఆర్ ( NTR ) కొరటాల కాంబినేషన్లో రాబోతున్న దేవర సినిమాలో కూడా నటించారు ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో రావటం విశేషం.